NRPT: కోస్గి 5వ వార్డులో కాంగ్రెస్ నాయకుడి దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. అధికార మదంతో కాంగ్రెస్ దాడులకు దిగుతోందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.