కరీంనగర్ టౌన్-IIలో విద్యుత్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏడీఏ లావణ్య తెలిపారు. అంజనాద్రి టెంపుల్, దోబీ ఘాట్, గోదాంగడ్డ, బీఎస్ఎఫ్, జడ్పీ క్వార్టర్స్, మల్లమ్మ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.