NLG: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా ను జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం మునుగోడులో చేనేత కార్మికులతో కలిసి ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. చేనేత కార్మికులకు రూ. 5 లక్షల ఆరోగ్య భీమా సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.