WNP: బడ్జెట్లో బీసీలకు జరిగిన అన్యాయంపై రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం వనపర్తి జిల్లాలోని రాజీవ్ చౌరస్తా దగ్గర నిరసన తెలిపి మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏటా రూ.20,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలకు మొండి చేయి చూపిందని విజయ్ యాదవ్ విమర్శించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.