CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి మండలంలో తనిఖీలు నిర్వహించినట్టు గుడిపాల ఎస్సై రామ్మోహన్ తెలిపారు. బహిరంగంగా మద్యం తాగుతున్న ఇద్దరిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆయన హెచ్చరించారు. బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవని వెల్లడించారు.