GDWL: జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయని, పోలీస్ శాఖ పటిష్ట భద్రత కల్పించాలని, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆయన సూచించారు.