AP: పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించేలా కేంద్రంతో ప్రభుత్వం సహకార ఒప్పందం చేసుకుంది. 13,426 పంచాయతీల్లో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టనుంది. తొలిదశలో 1,692 పంచాయతీల్లో నెట్వర్క్ అప్గ్రేడ్, రెండోదశలో 11,254 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పూర్తి చేయనుంది. కొత్తగా ఏర్పడిన 480 పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది.