WNP: గోపాల్ పేట మండలం, చిట్యాల గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్లను పోలీసులు గుర్తించి తిరిగి అందజేశారు. CEIR పోర్టల్ సహాయంతో ఫోన్లను ట్రేస్ చేసిన ఎస్ఐ జగన్ మోహన్ శనివారం బాధితులకు వాటిని అప్పగించారు. ఫోన్లు తిరిగి లభించడంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.