ATP: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతన్నలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలన్నారు. ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు.