GNTR: తెనాలి పట్టణంలో రహదారుల పట్ల అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారింది. ప్రధానంగా రద్దీగా ఉండే బోసురోడ్డు పాత స్వరాజ్య టాకీస్ సెంటర్ వద్ద కేబుల్స్ కోసం రోడ్డును తవ్వి వదిలేయడం, పక్కనే మరో భారీ గొయ్యి ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మృత్యుకుహరాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రాణనష్టం జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు.