TG: ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్ పనులపై దిశానిర్దేశం చేశారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచిన దేవాదుల నుంచి సుమారు 469 మీటర్ల ఎత్తుకు నీటిని తరలిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆరున్నర లక్షల ఎకరాకలకు నీరు అందించవచ్చు.