KRNL: పెద్దకడబూరు మండలంలోని రంగాపురం గ్రామంలో కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలను చల్లగా చూడాలని ఆకాంక్షించారు.