BDK: బూర్గంపాడు మండలం శ్రీరాంపురం పాయం ఎస్టీ కాలనీని సీడీపీవో రేవతి శుక్రవారం సందర్శించారు. శ్రీరాంపురం పాయం కాలనీలో కొత్త అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై గ్రోత్ మానిటరింగ్ చేపట్టి, వారికి టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేశారు.