ASR: అడవి బిడ్డల ప్రాణాలతో అటవీ శాఖ అధికారులు చెలగాటమాడొద్దని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతరామారావు శుక్రవారం అన్నారు. 20 రోజులుగా జిల్లాలో ప్రజలను హడలెత్తిస్తున్న పులి కదలికలతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. వన్యప్రాణులు సంరక్షణ పేరుతో ఆదివాసులను భయపెట్టడం తగదన్నారు. హక్కులు, ప్రాణ రక్షణ కోసం సంఘటితం అవుదామన్నారు.