కృష్ణా: క్యాన్సర్ను సకాలంలో గుర్తించి చికిత్స పొందాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో పీఏసీఎస్ చైర్మన్ మల్లుపెద్ది దుర్గామహేష్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో – అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని వెంకట్రామ్ ప్రారంభించారు.