KRNL: ఆదోని మండల కడితోట గ్రామ బస్టాండ్ సమీపంలో ఇవాళ రూరల్ సీఐ నల్లప్ప,పెద్దతుంబలం ఎస్సై విద్యశ్రీ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, వాహనానికి సంబంధించిన వ్యాలిడ్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.