SRCL: జిల్లాలో ఆరోగ్య కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించు కోవాలని DMHO ఎస్.రజిత కోరారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్ష చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. నిర్దేశిత రోజుల్లో నాలుగు దశల్లో నిర్వహిస్తామని వివరించారు. ఈనెల 31 వరకు గర్భిణీలు, వృద్ధులకు రక్తహీనత పరీక్షలు చేస్తారని తెలిపారు.