VKB: ధారూర్ మండలంలోని అల్లాపూర్, రుద్రారం, నాగసమందర్ అటవీ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. రహస్య మార్గాలు ఏర్పాటు చేసి వాగులను గుల్లగా తరలిస్తూ ప్రభుత్వ వనరులను దోచుతున్నారని స్థానికులు తెలిపారు. రుద్రారం, అల్లాపూర్, గట్టేపల్లి, తిమ్మనగర్ గ్రామాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ఈ అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నట్లు సమాచారం.