BHPL: మల్హర్(M) కొయ్యూరు మసీదులో ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ప్రకాష్ రెడ్డి అన్నారు.