NZB: నగరంలోని గాయత్రి నగర్, లక్ష్మీప్రియానగర్, ముబారక్ నగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని చెప్పుకొచ్చారు. వర్షం పడితే రోడ్లన్ని చిత్తడిగా మారి ప్రయాణానికి కష్టతరమవుతుందన్నారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు.