NLG: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.60, వాణిజ్య సిలిండర్ ధరను రూ. 116 పెంచడంపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్యాలలో ఇవాళ జరిగిన సంఘం మండల కమిటీ సమావేశంలో కత్తుల లింగస్వామి, మెట్టు పరమేష్, కుమారస్వామితో కలిసి ఆయన మాట్లాడుతూ.. పెరిగిన ధరలు పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారంగా మారాయన్నారు.