MDCL: మేడిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేశ్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమవుతున్న వేళ బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి రవి ఇతర నాయకులు పాల్గొన్నారు.