NGKL: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు గురువారం కల్వకుర్తి పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. RSS వ్యవస్థాపకుడు డా. కేశవ్ బాలిరామ్ హెడ్గేవార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం ఉగాది వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.