కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో 220 గ్రాముల నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించారు.