ప్రకాశం: రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో మొక్కజొన్న రైతులు ఆర్గనైజర్ల మోసానికి గురయ్యారు. అధిక దిగుబడి వస్తుందని నమ్మబలికి విత్తనాలు ఇచ్చినప్పటికీ, పంట కోతకు కేవలం అరటన్ను మాత్రమే దిగుబడి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ఒక్కో ఎకరానికి సుమారు రూ.35,000 వరకు నష్టపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.