BDK: ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ఉగాది, రంజాన్ పండుగల దృష్ట్యా నియోజకవర్గంలోని ఆలయాలు, మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల నుంచి ఆయన ఫోన్ ద్వారా అధికారులతో సమీక్షించారు.