అన్నమయ్య: రాయలసీమ కవులు, కళాకారులకు ఉగాది పురస్కారాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని డా. తవ్వా వెంకటయ్య బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2026 ఉగాది అవార్డుల్లో కోస్తాంధ్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పక్షపాతానికి నిదర్శనమని, కడప ఉమ్మడి జిల్లాలో ఒక్కరికి కూడా అవకాశం లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.