BDK: ప్రాధాన్యతా రంగాల రుణాల లక్ష్యాలు, సాధనపై కలెక్టర్ అంకిత్ బుధవారం సమగ్ర సమీక్ష జరిపారు. జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 31-12-2025 నాటికి జిల్లాలో మొత్తం ప్రాధాన్యతా రంగంలో 4945.28 కోట్ల లక్ష్యానికి గాను 4010.50 కోట్లు మంజూరు చేయబడిందని అన్నారు.