KMM: ముదిగొండ మండలంలొ పదో తరగతి సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసిందని ఎంఈవో రమణయ్య తెలిపారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 5 పరీక్షా కేంద్రాలలో మొత్తం 516 మంది విద్యార్థులకు గాను 515 మంది హాజరయ్యారు. ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు,విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.