జగిత్యాల జిల్లా కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, తదితర అధికారులు పాల్గొన్నారు.