KMR: ప్రతిరోజు వందలాది మంది రాకపోకలతో నిత్యం కళకళలాడే KMR మున్సిపల్ కార్యాలయం జనాలు లేక బోసిపోయింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడుల తర్వాత బుధవారం ఒక్కసారిగా జన సంచారం తగ్గడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో పలు రకాల పనుల నిమిత్తం వందలాదిగా వచ్చే జనాలు ఒక్కసారిగా తగ్గడానికి కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ సాగుతోంది.