TPT: ఈనెల 20, 21 తేదీల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుపతి, తిరుమల పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి భద్రత, హెలిప్యాడ్, వైద్య సదుపాయాలు, కాన్వాయ్ ఏర్పాట్లపై చర్చించారు.