నిర్మల్ పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం జిల్లా జడ్జి శ్రీవాణి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో కోర్టుకు వచ్చే ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో న్యాయ సేవ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.