NRPT: మాగనూరు మండలంలో నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫామింగ్ కార్యక్రమం భాగంగా మంగళవారం రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో “రైతు నేస్తం” ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రసాయన రహిత పద్ధతుల్లో సాగు చేసే ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.