AP: కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పరకామణి కేసులో మళ్లీ FIR నమోదు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలను నిందితులుగా ఇరికించేందుకే ఒక డీఎస్పీకి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారని విమర్శించారు.