KMR: బిక్కనూర్ మండలం గురజాకుంటలో నేడు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ భరత్ కుమార్ పరిశీలించారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి దేవేందర్, సర్పంచ్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు