CSK ప్లేయర్ ప్రశాంత్ వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తొలిసారి ధోనీని కలిసినప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుకోలేదని, డబ్బు గురించి మాట్లాడుకున్నట్లు తెలిపాడు. IPL వేలం ద్వారా వచ్చిన డబ్బును వృథాగా ఖర్చు చేయొద్దని, పొదుపుపై దృష్టి సారించమని ధోనీ సలహా ఇచ్చినట్లు చెప్పాడు. ఈ అన్క్యాప్డ్ ఆల్రౌండర్ను CSK రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసింది.