AKP: సబ్బవరం మండలం తవ్వవానిపాలెంలో ఈ నెల 24న పరదేశిమాంబ పండగను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ స్వామి నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం గోడపత్రిక ఆవిష్కరించారు. పండగ సందర్భంగా ఆదివారం రాష్ట్రస్థాయి మహిళ వాలీబాల్ పోటీలు, 23న చిడతల పోటీలు జరుగుతాయన్నారు. 24న ఎడ్ల బండ్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.