ADB: ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సాత్నాల మండలంలోని సైదుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం నిర్వహించిన మెడికల్ క్యాంపులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజలు నాటు వైద్యులను నమ్మి మోసపోకూడదని హితవు పలికారు.