NDL: బనగానపల్లె(M) నందవరం చౌడేశ్వరి క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని మాజీ సర్పంచ్ BC రాజారెడ్డి సూచించారు. సోమవారం బనగానపల్లెలో ఆలయ కమిటీ ఛైర్మన్ పివి కుమార్ రెడ్డి, తదితరులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవ ఆహ్వాన పత్రికను అందజేసి స్వామివారి ఆశీస్సులు అందించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజారెడ్డి కోరారు.