నాగచైతన్య ప్రస్తుతం ‘వృషకర్మ’ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే తనకు ఎప్పటి నుంచో భారీ మైథలాజికల్ మూవీ చేయాలని ఉందని చైతు తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారతీయ పురాణాల పట్ల ఆసక్తి పెరుగుతోందని, అత్యాధునిక సాంకేతికతతో ఆ అద్భుత ప్రపంచాన్ని వెండితెరపై చూపించడం తన కల అని చెప్పాడు. ఇక ‘వృషకర్మ’ సీక్వెల్ గురించి స్పందిస్తూ.. అది మొదటి భాగం సాధించే విజయంపైనే ఆధారపడి ఉంటుందన్నాడు.