MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ పరిధిలో ఉన్న రైతులు భూసార పరీక్షలను తప్పనిసరిగా చేయించాలని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పంటలలో దిగుబడిని పెంచేందుకు, పురుగుల ఉధృతిని తగ్గించేందుకు భూసార పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. సోమవారం నుండి భూసార పరీక్షలు చేస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.