ATP: గుత్తి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ హాజరయ్యారై పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఉద్యమించిన మహనీయుడి ఆశయ సాధనకు కృషి చేయడమే అమరజీవికి మనమిచ్చే నివాళి అన్నారు.