NGKL: రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మత్స్యకారుల అభివృద్ధికి బడ్జెట్లో రూ. 5000 కోట్లు కేటాయించాలని కోరుతూ పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. జిల్లా కన్వీనర్ శంకర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రూ. 986 కోట్లతో పాటు ఎక్స్రేషియాతో పాటు రూ. 50 కోట్లు కలిపి బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు.