PDPL: రామగుండం మున్సిపల్ చౌరస్తా సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న యాష్ లారీ టూ వీలర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంటనే స్పందించి, ట్రాఫిక్ ఎస్సై హరి శేఖర్ సహాయంతో గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.