VZM: బొండపల్లి మండలం జిపిఅగ్రహారం గ్రామానికి చెందిన సుమారు 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఆదివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పాలన నచ్చి పార్టీలో చేరుతున్నామని వారు చెప్పారు.