WGL: సంగెం మండల కేంద్రంలోని మజీద్లో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆదివారం జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావం, సహనం, ఐక్యతకు ప్రతీకగా ఉంటుందని, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని ఆయన అన్నారు.