BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో రేపు నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం ప్రకటించారు. గిరిజనులు తమ తమ సమస్యలు లిఖితపూర్వకంగా అధికారులకు అందజేయాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు సమావేశ మందిరంలో యూనిట్ అధికారులు హాజరవ్వాలని ఆదేశించారు.