CTR: బంగారుపాళ్యం మండలం గౌరీ నారాయణపురంకు చెందిన పండు (42) ప్రమాదవశాత్తు మొగిలి కోనేరులో పడి మృతి చెందాడు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈనెల 19 లేదా 20న కోనేరులో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. బాధితుడి భార్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.