MDK: తెలంగాణ ప్రభుత్వ 99వ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామ పంచాయతీ వద్ద పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి ఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు.